అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో గురువారం తెల్లవారు జామున భారీ వర్షం(Heavy Rain) కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచి చెరువులను తలపించాయి.
మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మైలార్దేవ్ పల్లి, ఆరాంఘర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్ తదిత ప్రాంతాల్లో వర్షం కురిసింది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి(Lingampalli Railway Underbridge) కింద భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు నేడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) హెచ్చరించారు.