అక్షరటుడే, ఆర్మూర్:Terrorist attack | పహల్గామ్(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇజ్రాయిల్లోని రామత్గాన్లో కొవ్వొత్తుల ర్యాలీ(Candle Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సోమరవి మాట్లాడుతూ.. ఉగ్రదాడిలో అమాయక ప్రజల ప్రాణాలు పోగొట్టుకున్నారని.. వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం(Modi Government) తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ముంబయి వివేక్, శ్రీనివాస్ గౌడ్, మెదక్ యాదగిరి, జగిత్యాల అశోక్, నవీన్, మహేష్ గౌడ్, గంగా సాగర్, తిరుమల సాయి తదితరులు పాల్గొన్నారు.