అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కేసీఆర్ను విచారణకు పిలిచిన ఈరోజును బ్లాక్డేగా మిగిలిపోతుందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్ట్లో చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూసి పెద్దవిగా మార్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మహా జలశక్తి పీఠమని అభివర్ణించారు.
ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందుతోందన్నారు. ప్రాజెక్ట్పై ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కథ ఇక ముగిసిపోనుందన్నారు.