అక్షరటుడే, వెబ్డెస్క్: KCR | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమిషన్ ఛైర్మన్ పీసీఘోష్(PC Ghosh) కేసీఆర్ను ఫేస్ టూ ఫేస్ విచారిస్తున్నారు. మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్ను కమిషన్ బహరంగంగా విచారించింది. కేసీఆర్ను కూడా బహిరంగ విచారణకు పిలిచింది. దీంతో కేసీఆర్(KCR)తో పాటు తొమ్మిది మంది కమిషన్ కార్యాలయంలోకి వెళ్లారు. అయితే అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కేసీఆర్ కోరారు. కేసీఆర్ కోరిక మేరకు కమిషన్ వన్ టూ వన్ విచారణ చేపట్టింది. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించారు.
KCR | బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్
కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్కే భవన్(BRK Bhavan) వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్(Police Arrest) చేశారు. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యక్తరల మధ్య తోపులాట చోటు చేసుకుంది.