More
    HomeతెలంగాణKtr Brs | రేవంత్ రెడ్డి చిల్లర వ్యక్తి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

    Ktr Brs | రేవంత్ రెడ్డి చిల్లర వ్యక్తి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ktr Brs | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR)​ కాళేశ్వరం విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) చిల్లర వ్యక్తి అని ఆయన అన్నారు.

    కరువు ప్రాంతమైన తెలంగాణ(Telangana)ను భారత్‌లో అగ్రభాగాన నిలబెట్టినందుకు కేసీఆర్​కు నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నాలుగేళ్లలో కట్టినందుకు.. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అనే చిల్లర వ్యక్తి.. హామీలు, గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

    Ktr Brs | కాంగ్రెస్​, బీజేపీ కుట్ర

    కేసీఆర్​పై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్​ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో వంద కాంపోనెంట్స్ ఉన్నాయని ఆయన వివరించారు. ఒక్క దాంట్లో చిన్న సమస్య వచ్చి, రెండు పిల్లర్లు కుంగితే హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం ప్రాజెక్టు వేస్ట్ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    READ ALSO  CM Revanth Reddy | రాహుల్‌, ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

    Ktr Brs | కాంగ్రెస్​ వాళ్లే కూల్చి ఉంటారు..

    కాంగ్రెస్​ వాళ్లే మేడిగడ్డలో కుట్ర చేసి ఉంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు పిల్లర్లను కాంగ్రెస్‌వాళ్లే ఏదో చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్‌కు ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. కక్షసాధింపు, రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Ktr Brs | నిజాలు బయటకు వస్తాయి..

    కేసీఆర్​ నాలుగు ఏళ్లలో కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మించి 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని కేటీఆర్​ పేర్కొన్నారు. ఆయన గొప్పతనం రేవంత్​రెడ్డికి వంద జన్మలు ఎత్తిన అర్థం కాదన్నారు. రూ.94 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​లో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం ఆడిన డ్రామాలు ఇవి అన్నారు. కమిషన్(Commission) విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని కేటీఆర్​ అన్నారు.

    READ ALSO  AgriGold | నెరవేరనున్న అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల కల.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ఆస్తుల పంపిణీ!

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....