అక్షరటుడే, వెబ్డెస్క్:Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్కే భవన్(BRK Bhavan)కు చేరుకున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్హౌస్(Erravalli Farmhouse) నుంచి ఆయన నేరుగా బీఆర్కే భవన్కు వచ్చారు. మరికాసేపట్లో జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కేసీఆర్ను విచారించనున్నారు. భవనంలోకి కేసీఆర్తో పాటు తొమ్మిది మందిని మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు. ఆయన వెంట హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెళ్లారు.
Kaleshwaram Commission | ఏం చెబుతారో..
కేసీఆర్(KCR) కాళేశ్వరం కమిషన్ విచారణలో ఏం చెబుతారోననే ఉత్కంఠ నెలకొంది. తాను దగ్గరుండి ప్రాజెక్ట్ను డిజైన్ చేయించినట్లు గతంలో కేసీఆర్ అనేకమార్లు చెప్పుకున్నారు. కమిషన్ ఎదుట విచారణలో అధికారులు అందరూ కేసీఆర్ చెప్పినట్లు చేశామని ఒప్పుకున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు హరీశ్రావు(Hraish Rao), ఈటల రాజేందర్(Eatala Rajendar) మాత్రం కేబినేట్ ఆమోదం మేరకు పనులు చేపట్టామని కమిషన్కు తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.
Kaleshwaram Commission | భారీగా చేరుకుంటున్న గులాబీ శ్రేణులు
కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Learders) భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. బీఆర్కే భవన్ గేటు వద్ద వారిని అడ్డుకోగా.. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బీఆర్ఎస్, కేసీఆర్(KCR)కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు సైతం అక్కడ భారీగా మోహరించారు. బీఆర్కే భవన్లోకి ఎవరు వెళ్లకుండా దిగ్భందనం చేశారు. ఆయా మార్గాలను మూసివేశారు.