అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk and Drive | డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్(Inspector Prasad) నగరంలో తనిఖీలు చేస్తుండగా..
33 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 30 మందికి రూ. 57,000 జరిమానా విధించారు. ముగ్గురిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి ముగ్గురికి రెండురోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.