అక్షరటుడే, వెబ్డెస్క్: Malreddy Ranga Reddy | మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్బాబు(Minister Sridhar Babu) సోమవారం కలిశారు. ఆయనకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో కార్యకర్తలు మనస్తాపానికి గురయ్యారని శ్రీధర్బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి కష్టకాలంలో ఆయన చాలా సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్బాబు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కరికి అయినా మంత్రి పదవి ఇవ్వాలని కొంతకాలంగా మల్రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల మేరకు అధిష్టానం పదవులను భర్తీ చేయడంతో మల్రెడ్డి(Malreddy)కి నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్(PCC President Mahesh Goud) వెళ్లి ఆయనను బుజ్జగించారు. తాజాగా మంత్రి శ్రీధర్బాబు ఆయనతో మాట్లాడారు. భవిష్యత్లో ఆయనకు పదవి దక్కేలా కేంద్ర, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.