అక్షరటుడే, వెబ్డెస్క్ : Rtc Pass Price Hike | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్పాస్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో(Green Metro) ఏసీ బస్పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచడం గమనార్హం. కొత్తగా పెంచిన రేట్లు నేటి నుంచి అమలులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రూ.రూ.1,150 ఉన్న ఆర్డినరీ బస్ పాస్ రూ.1,400కు పెరిగింది. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్పాస్ ధర రూ.1,600 అయింది.
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో ఎంతో మంది వేతన జీవులు బస్పాస్లు తీసుకొని ప్రయాణాలు సాగిస్తుంటారు. ఆర్డీనరి, మెట్రో బస్పాస్లను తీసుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. తాజాగా ఆర్టీసీ 20శాతం బస్ పాస్ రేట్లు(Bus Pass Rates) పెంచడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.