అక్షరటుడే, వెబ్డెస్క్:Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు(Former SIB chief Prabhakar Rao) ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఆయన సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అయితే పంజాగుట్ట పోలీసు స్టేషన్(Panjagutta Police Station)లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే అమెరికా పారిపోయిన ప్రభాకర్రావు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. రద్దు చేసిన పాస్పోర్టు పునరుద్ధరించి, ఆయనకు వన్టైం వీసా మంజూరు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. అలాగే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. దీంతో ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారు.
Phone Tapping Case | ఆ అధికారి తీరు చర్చనీయాంశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో 15 నెలలుగా పరారీలో ఉన్న ప్రభాకర్రావు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగారు. అక్కడ ఆయనకు కస్టమ్స్ అధికారి(Customs officer) స్వాగతం పలకడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ కేసులో నిందితుడికి అధికారి ఎలా స్వాగతం పలుకుతారని ప్రశ్నలు తలెత్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు సైతం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు సదరు కస్టమ్స్ అధికారిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిసింది. దీంతో అతడిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ రోజ సిట్ ఎదుట ప్రభాకర్రావు విచారణకు హాజరు కానున్నారు. ఆయన ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.