More
    HomeజాతీయంKarnataka | కట్నం కోసం రెండో పెళ్లి చేసుకోవాలన్న భర్తకు మొదటి భార్య చెప్పుతో గుణపాఠం!

    Karnataka | కట్నం కోసం రెండో పెళ్లి చేసుకోవాలన్న భర్తకు మొదటి భార్య చెప్పుతో గుణపాఠం!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఈ సీన్ చూస్తే సినిమా సన్నివేశమా? హాస్యనాటకమా? అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. అసలు కథను విన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు, నవ్వుతున్నారు, బాధపడుతున్నారు కూడా. ఇది కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చోటు చేసుకున్న అసలైన సంఘటన.

    చిక్‌మంగ‌ళూరు జిల్లా(Chikmagalur district)కు చెందిన కార్తీక్ Karthik అనే వ్యక్తి, నాలుగేళ్ల క్రితం తనూజ అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ శుభసంధర్భంలో కార్తీక్ కుటుంబానికి తగినంత కట్నం ఇచ్చినట్లు సమాచారం. జీవితంలో ఇద్దరూ కలిసి అడుగులు వేస్తారని, కుటుంబం ఆనందంగా సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, కార్తీక్ మనసు మాత్రం వేరే విధంగా వెళ్లింది.

    Karnataka : తగిన బుద్ధి..

    కొంత కాలానికి కార్తీక్ కట్నం మీద దురాశ చూపడం మొదలుపెట్టాడు. తనూజతో కలిసి గడిపే జీవితం కన్నా, ఇంకొకరిలో కొత్తగా లాభం కనిపించింది. మరొక కుటుంబం నుంచి పెద్ద మొత్తం కట్నం వస్తుందని ఊహించి, రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఈసారి అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల మధ్య పెళ్లి జరగాలన్నది అతని కోరిక.

    READ ALSO  Bike Taxi | నిలిచిపోనున్న బైక్​ ట్యాక్సీల సేవలు.. ఎక్కడంటే..

    కానీ అతని పథకం అతని భార్యకు తెలియకుండా పూర్తవుతుందని తాను ఊహించలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవించే తనూజ, భర్త Husband తీరులో మార్పు గమనించి అతని చలాకీతనాన్ని పరిశీలించసాగింది. చివరికి నిజం తెలిసింది. కార్తీక్ మరో పెళ్లి చేసుకుంటున్నాడన్న సమాచారం ఆమెకు చేరింది.

    ఒక్కసారిగా ఆమె తల్లిదండ్రులతో కలిసి చిత్రదుర్గ గాయత్రి కళ్యాణ మండపాని(Chitradurga Gayatri Kalyana Mandapam)కి వెళ్లింది. అప్పటికే కార్తీక్ శుభకార్యానికి సిద్ధంగా ఉండగా, తనూజ Tanooja అతన్ని నిలదీసింది. కార్తీక్ సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవ‌డానికి ప్రయత్నించగా, తనూజ ఆగ్రహానికి లోనైంది. కట్నం కోసం దురాశతో రెండో పెళ్లికి సిద్ధమైనందుకు పెళ్లి మండపంలోనే అతని ముఖంపై చెప్పుతో కొట్టి తగిన గుణపాఠం చెప్పింది.. ఈ దృశ్యం చూసిన కార్తీక్ తల్లిదండ్రులు, రెండో వధువు కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెళ్లి అట్టహాసంగా జరగాల్సిన చోట… అపహాస్యం, అవమానం చోటు చేసుకుంది. ఈ ఘటన అక్కడి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా(social media)లో షేర్ చేశారు. వీడియో క్షణాల్లో వైరల్ అయింది.

    READ ALSO  Global Tech Hub | వ‌ర‌ల్డ్ టెక్ హ‌బ్‌గా బెంగ‌ళూరు.. 10 ల‌క్ష‌లు దాటిన టెక్ వ‌ర్క్ ఫోర్స్‌

    కట్నం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకునే వారిని సమాజం(Society) సహించదు.మహిళలు ఇక మౌనంగా ఉండే రోజులు పోయాయి. అవమానానికి తలవంచే రోజులు పోయాయి.ఆడపిల్లలు న్యాయం కోసం పోరాడతారు, ఎంతటి పరిస్థితి అయినా ఎదుర్కొంటారు.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....