అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | బాగా చదువుకోవాలని తండ్రి మందలించగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ (Nirmal) జిల్లా నర్సాపూరం గ్రామానికి చెందిన సిందే శివకుమార్ నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో (Polytechnic College) రెండో సంవత్సరం చదువుతున్నాడు.
అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్లలో సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో తండ్రి బాగా చదువుకోవాలని మందలించాడు. కాగా.. వారం క్రితం శివకుమార్ సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) రాయడానికి నిజామాబాద్కు వచ్చాడు. 6వ తేదీన దాస్నగర్ (Dasnagar) శివారులో గడ్డిమందు తాగి తిరిగి హాస్టల్కు వెళ్లి వాంతులు చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శివకుమార్ ఆదివారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.