More
    HomeతెలంగాణCongress party | రెడ్ల‌కు మొండి ‘చేయి’.. మారిన కాంగ్రెస్ వైఖ‌రి

    Congress party | రెడ్ల‌కు మొండి ‘చేయి’.. మారిన కాంగ్రెస్ వైఖ‌రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress party | తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటేనే రెడ్ల పార్టీగా ఎప్ప‌టి నుంచో ముద్ర ప‌డింది. ద‌శాబ్దాలుగా రెడ్ల (Reddys) ఆధిప‌త్య‌మే కొన‌సాగింది. పార్టీ క‌ష్ట‌కాలంలోనూ వెన్నంటి నిలిచిన రెడ్లకు కాంగ్రెస్ కూడా ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది.

    అయితే, సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న పార్టీ వైఖ‌రి ఇటీవ‌లి కాలంలో చాలా మారింది. కాంగ్రెస్‌లో (Congress party) క్ర‌మంగా రెడ్ల ప్రాధాన్యం త‌గ్గుతూ వ‌స్తోంది. అందుకు నిద‌ర్శ‌న‌మే తాజా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఆదివారం జ‌రిగిన విస్త‌ర‌ణ‌లో ముగ్గురికి మాత్ర‌మే అవ‌కాశం ద‌క్కింది. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కానీ, ప‌ద‌విపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ల‌కు మాత్రం అవ‌కాశం ద‌క్క‌లేదు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో (cabinet expansion) రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన సుద‌ర్శ‌న్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి వంటి వారికి బెర్త్ ల‌భిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, చివ‌ర‌కు వారికి భంగ‌పాటే ఎదురైంది.

    Congress party | త‌గ్గిన రెడ్ల ప్రాబ‌ల్యం

    ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌లో (Congrees) రెడ్డి సామాజికవ‌ర్గం నేత‌ల‌దే హ‌వా కొన‌సాగింది. పార్టీని మొద‌టి నుంచి రెడ్లు మాత్ర‌మే న‌డిపించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌క్కువ సంఖ్య‌లో ఉన్న‌ప్ప‌టికీ, అప్ప‌ట్లో ప‌ల్లెల్లో రెడ్ల ప్రభావమే ఎక్కువ‌గా ఉండేది. దీంతో స‌హ‌జంగానే వారు రాజకీయాల్లో (Politics) రాణించారు. ప్ర‌ధానంగా కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ (Reddys Party) అన్న‌ట్లుగా ముద్ర ప‌డింది. అందుకు త‌గిన‌ట్లుగానే వారు కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేశారు. ఈ నేప‌థ్యంలోనే నీలం సంజీవ‌రెడ్డి నుంచి మొద‌లుకుని కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి, భ‌వ‌నం వెంక‌ట్రామిరెడ్డి, నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి, మ‌ర్రి చెన్నారెడ్డి, కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వంటి రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అధిష్టించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వరకు అదే కొనసాగింది.

    READ ALSO  Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతుభరోసా, బోనస్​పై కీలక ప్రకటన

    Congress party | మారిన వైఖ‌రి..

    కొంత‌కాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) వైఖ‌రిలో చాలా మార్పు వ‌చ్చింది. రెడ్ల ఆధిప‌త్యంలో ఇన్నాళ్లు కొన‌సాగిన పార్టీ క్ర‌మంగా బ‌ల‌హీన‌వ‌ర్గాల పాట అందుకుంది. రాహుల్‌గాంధీ (Rahul gandhi) నాయ‌క‌త్వం వ‌చ్చిన త‌ర్వాతే ఈ మార్పు మొద‌లైంది. స‌మాజంలో అత్య‌ధికంగా ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు రాజ‌కీయ అవ‌కాశాలు క‌ల్పించాల‌ని రాహుల్ భావించారు. ఈ దిశ‌గానే కుల గ‌ణ‌న (Caste Census) చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచింది. అందుకు అనుగుణంగానే తెలంగాణ‌లో రేవంత్ స‌ర్కారు (Revanth Governament) కులగ‌ణ‌న చేప‌ట్టి, జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌ బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అందులో భాగంగానే తాజా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో (cabinet expansion) రెడ్ల‌కు చోటు ద‌క్క‌కుండా పోయింది. ఇది మారిన కాంగ్రెస్ వైఖ‌రికి నిద‌ర్శ‌నంగా నిలిచింది.

    READ ALSO  Cabinet Expansion | ఆగని మంత్రి పదవుల రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతుల కీలక వ్యాఖ్యలు

    Congress party | సామాజిక స‌మీక‌ర‌ణ‌లే కీల‌కం..

    ప్ర‌స్తుత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బ‌ల‌హీన‌వ‌ర్గాల వారికే అవ‌కాశం క‌ల్పించారు. మాల సామాజిక వ‌ర్గానికి చెందిన వివేక్‌కు, ముదిరాజ్ కుల‌స్తుడైన శ్రీ‌హ‌రికి, మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కు (Adluri Laxman) కేబినెట్‌లో చోటు ద‌క్కింది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణలో సామాజిక స‌మీక‌ర‌ణ‌లే కీల‌కంగా మారాయి. రాష్ట్రంలో బ‌ల‌మైన ముదిరాజ్‌ (Mudhiraj), మాదిగ కులస్తులు ఉండ‌గా, వారికి ప్రాతినిధ్యం ద‌క్కింది. ఇక‌, సీనియారిటీ కార‌ణంగా వివేక్‌కు చోటు ల‌భించింది. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే.. మారిన కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఎంతో ఆశ పెట్టుకున్న సుద‌ర్శ‌న్‌రెడ్డి (Sudharshan Reddy), రాజగోపాల్ రెడ్డి, మ‌ల్‌రెడ్డికి సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ప‌రాభ‌వ‌మే మిగిల్చాయి.

    కాగా.. మళ్లీ చేపట్టే విస్తరణలో అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఇస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) ఇవాళ ప్రకటించారు. అయితే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదు. ఒకవేళ తప్పనిసరి అయితే.. అది లోకల్ బాడీ ఎన్నికలు (Local Body elections) పూర్తయిన తర్వాతే..! ఈ నేపథ్యంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా కొత్తగా మంత్రివర్గంలోకి ఎంపిక ఉంటుంది. ఇదే సమయంలో మళ్లీ ఇప్పటి మాదిరే.. సామాజిక సమీకరణాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా తాజా మంత్రివర్గ కూర్పు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    READ ALSO  Kaleshwaram Commission | 'కాళేశ్వరం' పితామహుడు కమిషన్ ముందుకు..! నేడు విచారణకు హాజరు కానున్న కేసీఆర్

    Latest articles

    Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    More like this

    Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...