అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Padmashali Sangham |నగరంలో పద్మశాలీల వధూవరుల పరిచయ వేదికకు అనూహ్య స్పందన లభించిందని అఖిల భారతీయ పద్మశాలి సంఘం (All India Padmashali Association) సెంట్రల్ సభ్యుడు, పరిచయ వేదిక అధ్యక్షుడు దాసరి నర్సింలు పేర్కొన్నారు. 7వ పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఆదివారం నగరంలోని విజయలక్ష్మి గార్డెన్లో (Vijayalakshmi Garden) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఏటా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పరిచయ వేదికకు స్పందన బాగుందన్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు సిద్దిపేట(Siddipet), మెదక్(Medak), కామారెడ్డి(Kamreddy), మంచిర్యాల (Manchiryala) జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వధూవరులు హాజరయ్యారు.
కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సుభాష్, డాక్టర్ కేశవులు, పరిచయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మైస నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ భీమర్తి రవి, ఉపాధ్యక్షుడు భుస శ్రీనివాస్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పెంట దత్తాద్రి, మాజీ అధ్యక్షుడు ఎస్సార్ సత్యపాల్, మాజీ ప్రధాన కార్యదర్శి బిల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు.