అక్షరటుడే, వెబ్డెస్క్ : Chhattisgarh | భద్రత బలగాల (Security Forces) సెర్చ్ ఆపరేషన్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. మావోయిస్టు కీలక నేత హిడ్మా (Hidma) స్వగ్రామం పువ్వర్తిలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర బలగాలు నక్సల్స్కు కంచు కోటలుగా ఉన్న అడవుల్లోకి సైతం చొచ్చుకువెళ్తున్నారు. దండకారణ్యంలో సైతం నిత్యం కూంబింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోయిస్టులకు భారీగా మృతి చెందుతున్నారు.
Chhattisgarh | కీలక నేతల హతం
బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ (Bijapur National Park) అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్లలో మావోయిస్ట్ కీలక నేతలు సుధాకర్, భాస్కర్ మృతి చెందారు. శనివారం సైతం ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. బలగాల చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవడానికి యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్ఫార్మర్ పేరుతో ఓ గ్రామస్తుడిని హత్య చేసినట్లు సమాచారం. కాగా.. రెండు రోజుల క్రితం సైతం మావోయిస్టులు ఒ ట్రక్కును తగలబెట్టారు. ఛత్తీస్గఢ్లోని ఎన్హెచ్63పై కూలీలతో వెళ్తున్న ట్రక్కును ఆపి వారిని దింపేసిన అనంతరం దానికి నిప్పు పెట్టారు. అలాగే మరో బస్సును సైతం రెండు గంటల పాటు ఆపేసి అనంతరం వదిలేశారు.