అక్షరటుడే, వెబ్డెస్క్:Encounter | ఛత్తీస్గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్(Search operation) కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు మూడు రోజులుగా కూంబింగ్(Coombing) నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు.
శనివారం మళ్లీ ఎన్కౌంటర్ చోటు చేసుకోగా.. ఐదుగురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా తొలిరోజు మావోయిస్ట్ కీలక నేత ఏపీకి చెందిన సుధాకర్ మృతి చెందాడు. శుక్రవారం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో అగ్రనేత భాస్కర్ ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. శనివారం ఉదయం ఇద్దరు కీలక నేతలు హతం అయ్యారు. తాజాగా మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.