అక్షరటుడే, వెబ్డెస్క్ :Encounter in Bijapur | వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు (Maoists) ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కీలక నేతలను కోల్పోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం మళ్లీ ఎన్కౌంటర్ చోటు చేసుంది. ఈ ఘటనలో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం.
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా బలగాలు (Security Forces) క్రమంగా పట్టు సాధిస్తున్నాయి. ఆపరేషన్ కగార్(Operation Kagar)లో భాగంగా మావోల నిర్మూలనే లక్ష్యంగా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యాన్ని సైతం బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ నేషనల్ పార్క్ సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం బలగాలు మూడు రోజులుగా కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా శనివారం ఉదయం మళ్లీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు(Commanders) మృతి చెందారు. వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలం నుంచి పెద్దఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Encounter in Bijapur | కీలక నేతలు హతం
గత మూడు రోజులుగా నేషనల్ పార్క్ ప్రాంతంతో కూంబింగ్ (Coombing) చేపడుతున్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, తెలంగాణకు చెందిన భాస్కర్ మృతి చెందారు. సుధాకర్పై రూ.కోటి, భాస్కర్పై రూ.25లక్షల రివార్డ్ ఉంది. ఇటీవలే మావోయిస్ట్ టాప్ కమాండర్ నంబాల కేశవరావు సైతం మరణించారు. అగ్ర నేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందుతుండటంతో మావోలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని బలగాలు పేర్కొన్నాయి.