అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharatపై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ pakistan మరో దుశ్చర్యకు దిగింది. పాక్ ప్రమేయంతో జమ్మూకశ్మీర్లోని పహల్ గామ్లో ఉగ్రవాదులు pahalgam terror attack పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దాయాది దేశంతో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే ఇప్పటికే సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్.. తాజాగా ఓ భారత జవాన్ను bharat soldier అక్రమంగా బంధీగా తీసుకుంది. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ bsf జవాన్ను పాక్ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగింది. అయితే పాక్ సైనికులు అక్రమంగా బంధించారని భారత్ పేర్కొంది.
మరోవైపు పాక్తో సింధు నది ఒప్పందాలతో వాణిజ్యం రద్దు చేస్తున్నట్లు బుధవారం భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ప్రధాని pak pm షహబాజ్ షరీఫ్ Shahbaz Sharif అధ్యక్షతన సమావేశమైన ఆ దేశ జాతీయ భద్రత కమిటీ పలు ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత్తో వాణిజ్యం రద్దు చేసుకుంటున్నట్లు పాక్ ప్రకటించింది. తన గగనతలం మీదుగా భారత విమనాల రాకపోకలను అనుమతించమని స్పష్టం చేసింది. అంతేగాకుండా సిమ్లా ఒప్పందాన్ని Simla Agreement నిలిపివేస్తున్నట్లు తెలిపింది.