అక్షరటుడే, వెబ్డెస్క్:Meenakshi Natarajan | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy)తో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) శుక్రవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో వీరిద్దరూ సుమారు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. మీనాక్షి నటరాజన్ ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)లతో సమావేశమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆమె నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో చర్చకు వచ్చిన అంశాలపై ఆమె సీఎంకు వివరించినట్లు తెలిసింది. పార్టీ నేతల అభిప్రాయాలపై వారు చర్చించారు.
అలాగే ఇటీవల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా నియామకమైన మల్లు రవి(Mallu Ravi)పై అందిన ఫిర్యాదులపై కూడా చర్చించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతం, ప్రస్తుత పరిణామాలపై వారు చర్చించారు. కాగా.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్(PCC President Bomma Mahesh Goud) ఢిల్లీ వెళ్లి పలువురు నేతలతో సమావేశం అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి కావాలని పట్టుబట్టడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ పది రోజులుగా ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయా అంశాలను సీఎంకు వివరించారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా.. లేక మళ్లీ వాయిదా వేస్తారా అని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.