More
    HomeతెలంగాణMLA Makkansingh | కేసీఆర్‌ను ఇంప్రెస్ చేసేందుకే.. క‌విత ధ‌ర్నాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే

    MLA Makkansingh | కేసీఆర్‌ను ఇంప్రెస్ చేసేందుకే.. క‌విత ధ‌ర్నాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:MLA Makkansingh | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)కు నోటీసులు ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) ధ‌ర్నా చేయ‌డంపై రామ‌గుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌క్క‌న్‌సింగ్ రాజ్‌ఠాకూర్(MLA Makkansingh Rajthakur) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ లో త‌న‌ను ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న ఎమ్మెల్సీ క‌విత పార్టీ అధినేత, త‌న తండ్రి కేసీఆర్‌ను ఇంప్రెస్ చేసేందుకే ధ‌ర్నా నిర్వ‌హించింద‌ని ఆరోపించారు. గురువారం మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించిన మ‌క్క‌న్‌సింగ్‌.. క‌విత ధ‌ర్నా చేయడాన్ని ఎద్దేవా చేశారు. అస‌లు బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో ధ‌ర్నా చేసుకునే ప‌రిస్థితి కూడా లేకుండా చేశార‌ని గుర్తు చేశారు. పదేళ్ల పాల‌న‌లో క‌విత‌కు ఎన్న‌డూ గుర్తుకు రాని బీసీలు, ద‌ళితులు ఇవాళ ఎందుకు గుర్తుకొస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. దీనికంత‌టికీ కార‌ణం ఆమెకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోవ‌డ‌మేనని వెల్ల‌డించారు.

    READ ALSO  Nizamabad Excise police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

    MLA Makkansingh | గుర్తింపు లేద‌న్న‌దే ఆమె బాధ

    ఎమ్మెల్సీ క‌విత‌(MLC Kavitha)కు బీఆర్ఎస్‌లో త‌గిన గుర్తింపు లేకుండా పోయింద‌ని ఎమ్మెల్యే మ‌క్కన్‌సింగ్ అన్నారు. సొంత పార్టీ వాళ్లే ఆమెను దూరం పెడుతున్నార‌ని, దీంతో ఆమెలో ఫ్రస్టేష‌న్ పెరిగి పోయింద‌న్నారు. త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న బాధ‌లో ఉన్న ఆమె త‌న తండ్రిని ఇంప్రెస్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని , అందుకే బుధ‌వారం ధ‌ర్నా నిర్వ‌హించార‌ని తెలిపారు. కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందా? కమిషన్ ఇచ్చిందా? అన్న విష‌యం కూడా తెలియ‌కుండా ఆమె ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని మండిప‌డ్డారు. అస‌లు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం కాద‌ని, కాళేశ్వ‌రం క‌మిష‌న్(Kaleshwaram Commission) అని క‌విత గుర్తుంచుకోవాల‌ని సూచించారు. ఫార్ములా ఈ రేసు కేసు గురించి కేటీఆర్(KTR) ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. మొదట్లో లొట్ట‌పీసు కేసు అన్న కేటీఆర్‌.. ఇప్పుడు విచార‌ణ‌కు ఎందుకు రావ‌డం లేద‌న్నారు.

    READ ALSO  Kaleshwaram Commission | కాళేశ్వరం విచారణకు బయలుదేరిన కేసీఆర్​.. బీఆర్​కే భవన్ వద్ద ఉద్రిక్తత

    MLA Makkansingh | గ‌డీల పాల‌న గుర్తు లేదా?

    అమెరికాకు వెళ్లొచ్చాక క‌విత‌కు జ్ఞానోద‌యం అయిన‌ట్లు ఉంద‌ని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అందుకే ఇవాళ బీసీలు, ద‌ళితుల పాట పాడుతున్నార‌ని విమ‌ర్శించారు. మ‌రీ ప‌దేళ్ల గ‌డీల పాల‌న‌లో క‌విత‌కు బీసీలు, ద‌ళితులు ఎందుకు గుర్తుకు రాలేద‌ని ప్ర‌శ్నించారు. బీసీల‌కు, ద‌ళితుల‌కు తీర‌ని అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాల‌న్నారు. పార్టీ నేత‌లు దూరం పెడుతుండ‌డంతో గుర్తింపు కోసం క‌విత ఆరాట‌ప‌డుతున్నార‌ని, అందుకే కొత్త నాట‌కం ఆడుతున్నార‌ని ఆరోపించారు. ఆమెకు రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) గురించి మాట్లాడే నైతిక అర్హ‌తే లేద‌న్నారు.

    Latest articles

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    More like this

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...