అక్షరటుడే, హైదరాబాద్: GHMC : AIMIM పార్టీకి చెందిన సంతోష్నగర్ డివిజన్ కార్పొరేటర్(AIMIM Santoshnagar division corporator), GHMC స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు మోహమ్మద్ ముజాఫర్ హుస్సేన్(GHMC standing council member Mohammad Muzaffar Hussain) మరణించారు. బుధవారం జరిగిన GHMC కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు.
ముజాఫర్ హుస్సేన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ముజాఫర్ హుస్సేన్ మరణంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. GHMC అధికారులు, సహచరులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.