అక్షరటుడే, వెబ్డెస్క్: movie story : ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh) మొరాదాబాద్లోని ఓ ఇంటి ఆవరణలో ఆరవ్ అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో కోతుల గుంపు ఇంటి ఆవరణ(compound)లోకి వచ్చింది. కొడుకుపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయపడిన బాలుడి తండ్రి లఖన్ సింగ్.. వాటిని తరిమేందుకు గొడ్డలి విసిరాడు.
కానీ, ప్రమాదవశాత్తు ఆ గొడ్డలి(AXE) ఆరవ్కు తగిలింది. వేగంగా తగలడంతో పిల్లాడి మెడ తెగి, రక్తం ఎగజిమ్మింది. తీవ్రంగా గాయపడిన ఆరవ్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
కాగా, పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వకుండా బాలుడి మృతదేహాన్ని ఖననం చేశారు. బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
movie story : ప్రమాదమా..? హత్యనా..?
ఈ ఘటనపై లఖన్ బావమరిది జితేంద్ర సింగ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇది ప్రమాదం కాదని, హత్య అని అయన ఆరోపించాడు. లఖన్ తన భార్య అనితతో నిత్యం గొడవ పడేవాడని చెప్పాడు. సోమవారం రాత్రి కూడా అనితను గదిలో బంధించి లఖన్ కొట్టినట్లు పేర్కొన్నాడు. మంగళవారం ఉదయం మళ్ళీ భార్యాభర్తలు గొడవ పడగా.. కోపంలో అక్కడే ఉన్న బాలుడు ఆరవ్ను గొడ్డలితో నరికి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
movie story : ఇక మరో కథనం ఏంటంటే..
దీనిపై జిల్లా పంచాయతీ సభ్యుడు(Zilla Panchayat member) జగత్ సింగ్ సైని వివరణ ఇచ్చారు. లఖన్ ఇంట్లో ఇటీవలే టెంట్ వేశారని, ఇందుకోసం ఇంటి పైకప్పుపై ఇనుప రాడ్లు ఉంచారని వివరించారు. మంగళవారం ఉదయం వచ్చిన కోతుల గుంపు వాటిని పడవేయడం వల్ల.. అవి బాలుడిపై పడటంతో తలకు గాయమై మృతి చెందినట్లు చెప్పుకొచ్చారు. ఒకే ఘటనపై మూడు రకాల కథనాలు విన్న పోలీసులు.. తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. మరి ఏది నిజమో విచారణ(investigation)లో తేలనుంది.