అక్షరటుడే, నిజాంసాగర్: Bhu Bharati Act : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు రిష్కారం అవుతాయని అదనపు కలెక్టర్ విక్టర్(Additional Collector Victor) పేర్కొన్నారు. నిజాంసాగర్(Nizamsagar) మండలంలోని మంగుళూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు(revenue conference)లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భూ సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ(government) లక్ష్యమన్నారు. దీని కోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఆయా గ్రామాలలో నిర్దేశించిన తేదీల ప్రకారంగా సదస్సులు జరుగుతాయన్నారు. ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నిజాంసాగర్ తహసీల్దార్ భిక్షపతి, ఆర్ఐ సాయిలు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.