అక్షరటుడే, కోటగిరి : Bodhan Sub-Collector | ప్రభుత్వం భూభారతిపై అవగాహన కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahatho) అన్నారు.
బుధవారం రుద్రూర్ మండలంలోని (Rudrur mandal) రాయకుర్లో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరై రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం BhuBharati website అమలు చేస్తోందని, నిర్దేశిత గడువులోపు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.