More
    HomeజాతీయంInstagram Reels | రీల్స్ కోసం న‌దిలోకి.. ఆరుగురు అమ్మాయిలు మృతి

    Instagram Reels | రీల్స్ కోసం న‌దిలోకి.. ఆరుగురు అమ్మాయిలు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Instagram Reels | రీల్స్ Reels పిచ్చి అనేక మంది మృత్యువుకి కార‌ణం అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆ మ‌ధ్య రైలు పట్టాలపై రీల్స్‌ చేసేందుకు ప్రయత్నించిన కుటుంబం అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తలతోపాటు వారి కుమారుడు కూడా మరణించాడు. ప్రతీ నిత్యం ఏదో ఒక న్యూస్ టిక్‌టాక్(TikTok) విషాదాల గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు టిక్ టాక్ కోసం రీల్స్ చేశారు. టిక్‌టాక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత.. ఆ స్థానాన్ని ఇన్‌స్టాగ్రామ్(Instagram) తీసుకుంది. ఇన్‌స్టాలో ఫేమస్ అవ్వాలని చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్ర‌మాదాలు కొని తెచ్చుకుంటున్నారు. .

    READ ALSO  Traffic control | అక్కడ ట్రాఫిక్​ నియంత్రణ.. ఉల్లంఘనులకు జరిమానా ఇక ఏఐతోనే..!

    Instagram Reels | రీల్స్ పిచ్చి

    తాజాగా, ఓ ఆరుగురు అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్ Instagram రీల్స్ వీడియో చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. నదిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రా సమీపంలోని నగ్లా స్వామి గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ వీడియో(Reels video) తీయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు. నది వారి ఇళ్లకు 800 మీటర్ల దూరంలోనే ఉంది.ఆ ఆరుగురు అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు. వీడియో తీసుకుంటూ ఉన్నారు. అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి నీటిలో మునిగింది. ఇది గమనించిన మిగిలిన వాళ్లు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. వారు కూడా నీటిలో మునిగిపోయారు.

    READ ALSO  PM Modi | ఇరాన్ అధ్య‌క్షుడికి మోదీ ఫోన్‌.. తాజా ఉద్రిక్త‌త‌ల‌పై ఆందోళ‌న‌

    అక్కడే ఉన్న ఓ ఇద్దరు అబ్బాయిలు వారిని రక్షిద్దామని అనుకున్నారు.వారు కూడా నీటిలో కొట్టుకుపోయారు. ఇలా ఆరుగురు అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, పోలీసులు(Police) నది దగ్గరకు చేరుకున్నారు.నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలించారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు. వారిలో నలుగురు అప్పటికే చనిపోయి ఉన్నారు. మిగిలిన ఇద్దర్నీ ఆస్పత్రి(Hospital)కి తీసుకెళ్లారు. డాక్టర్లు సీపీఆర్ చేయటంతో బతికారు. అయితే, కొన్ని గంటల తర్వాత వారు కూడా చనిపోయారు. చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం కాగా.. నవంబర్ నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఆరుగురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డంతో కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

    READ ALSO  National Highway 44 | హైవే పై బోల్తా పడ్డ ఆలుగడ్డ లోడ్​ లారీ: ట్రాఫిక్​కు అంతరాయం

    Latest articles

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    More like this

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...