More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా..

    Yellareddy | ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా..

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఈత సరదా ముగ్గురు ముగ్గురు యువకులు ప్రాణాలను బలిగింది. నిజాంసాగర్​ ప్రాజెక్ట్(Nizamsagar Project)​ బ్యాక్​ వాటర్​ వద్ద సోమవారం సాయంత్రం ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మృతదేహాలు లభ్యమయ్యాయి. 16 గంటల పాటు పోలీసులు(Police), రెస్క్యూటీం(rescue team), గజ ఈతగాళ్లు(swimmers) కలిసి శ్రమించి వారి మృతదేహాలను బయటకు తీశారు. బొగ్గుగుడిసెకు చెందిన మధుకర్​ గౌడ్​(18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఐతే నవీన్​(21), సోమార్​పేట్​కు చెందిన బెస్త హర్షవర్ధన్​(17)లు మరికొందరు యువకులతో కలిసి సోమార్​పేట్​ సమీపంలో క్రికెట్​ ఆడేందుకు వెళ్లారు. అనంతరం యువకులంతా నిజాంసాగర్​ బ్యాక్​ వాటర్​లో స్నానం చేసేందుకు నీటిలో దిగారు.

    అయితే అందులో ముగ్గురు యువకులు మధుకర్​ గౌడ్​, నవీన్​, హర్షవర్ధన్​ మాత్రం నీళ్లలో గల్లంతయ్యారు. దీంతో మిగతావారు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో సోమవారం అర్ధరాత్రి వరకు వెతికించారు. మంగళవారం ఉదయం ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మధ్యాహ్నానికి మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసి వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాలను కాంగ్రెస్​ నాయకులు(Congress Leaders) కురుమ సాయిబాబా, విద్యాసాగర్​, సామెల్​, శ్రీనివాస్​రెడ్డి, ప్రశాంత్​గౌడ్​, తిరుపతి, ననుగొండ శ్రీనివాసులు ఓదార్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్​(CI Rajesh) తెలిపారు.

    READ ALSO  Minister Ponnam | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

    Yellareddy | బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

    నిజాంసాగర్​ బ్యాక్​వాటర్(Nizamsagar Back Water)​లో ఈతకు వెళ్లి మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను ఎమ్మెల్యే మదన్​మోహన్(MLA Madan Mohan) పరామర్శించారు. యువకుల మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేతికి అందివచ్చిన కొడుకులు అకాల మరణం చెందడం తల్లిదండ్రులకు గుండెకోతేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​(Collector)కు సూచించారు.

    Yellareddy | మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్..

    బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్​(Former MLA Nallamadugu Surender) పరామర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటనా జరిగిన ప్రదేశంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని వారిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిర్వహించి త్వరగా మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆయన అధికారులకు సూచించారు.

    READ ALSO  Kasula Balraj | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

    Latest articles

    Bigg Boss 9 Promo | ఈ సారి చ‌ద‌రంగం కాదు.. ర‌ణ రంగ‌మే.. ఆసక్తిక‌రంగా బిగ్ బాస్9 ప్రోమో

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bigg Boss 9 Promo | బుల్లితెర ప్రేక్షకుల‌కు మంచి కిక్ ఇచ్చే షో బిగ్ బాస్...

    Minister Seethakka | మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Minister Seethakka | రాష్ట్ర పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను...

    Ram Charan | రామ్ చ‌ర‌ణ్ చేతికి ఆ క‌ట్టు ఏంటి.. షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ram Charan | మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్​ చ‌రణ్ ప్ర‌స్తుతం పెద్ది సినిమా షూటింగ్‌తో...

    Water Problem | తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. చిన్నమల్లారెడ్డిలో దుస్థితి

    అక్షరటుడే, కామారెడ్డి: Water Problem | తలాపున నీళ్లున్నా గొంతులు తడారట్లేదు.. వర్షాకాలం వచ్చినప్పటికీ తాగునీటి గోస తప్పట్లేదు.....

    More like this

    Bigg Boss 9 Promo | ఈ సారి చ‌ద‌రంగం కాదు.. ర‌ణ రంగ‌మే.. ఆసక్తిక‌రంగా బిగ్ బాస్9 ప్రోమో

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bigg Boss 9 Promo | బుల్లితెర ప్రేక్షకుల‌కు మంచి కిక్ ఇచ్చే షో బిగ్ బాస్...

    Minister Seethakka | మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Minister Seethakka | రాష్ట్ర పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను...

    Ram Charan | రామ్ చ‌ర‌ణ్ చేతికి ఆ క‌ట్టు ఏంటి.. షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ram Charan | మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్​ చ‌రణ్ ప్ర‌స్తుతం పెద్ది సినిమా షూటింగ్‌తో...