అక్షరటుడే, వెబ్డెస్క్: Volleyball | పాకిస్తాన్(pakistan)పై భారత్ విజయం సాధించింది. అద్భుత విజయం అందుకుంది.
ఉజ్బెకిస్తాన్లో జరుగుతున్న సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (Asian Volleyball Association) నేషన్స్ లీగ్లో పాకిస్తాన్పై భారత్ ఈ విజయం సాధించింది. 25–19, 25–19, 25–23 తేడాతో భారత్ పాక్ను చిత్తు చేసింది. ఈ లీగ్లో భాగంగా భారత్ ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడింది. ఇందులో మూడు మ్యాచుల్లో గెలుపొందగా.. మూడింటిని డ్రా చేసుకుంది. ఒక దాంట్లో ఓడిపోయింది.
వాస్తవానికి ఈ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఇటీవల భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఆ దేశానికి వెళ్లడానికి నిరాకరించింది. దీంతో వేదికను ఉజ్బెకిస్తాన్కు మార్చింది. తాజాగా పాక్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.