More
    HomeతెలంగాణCabinet Expansion | మీనాక్షి నటరాజన్​ వరుస సమీక్షలు.. మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చేనా..!

    Cabinet Expansion | మీనాక్షి నటరాజన్​ వరుస సమీక్షలు.. మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చేనా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cabinet Expansion | రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అంశం కొలిక్కి రావడం లేదు. ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ చేపడుతారనే సమయానికి పలువురు నిరసన గళం వినిపిస్తున్నారు. దీంతో వారిని బుజ్జగించలేక ప్రతీసారి మంత్రివర్గ విస్తరణ అంశాన్ని హైకమాండ్​ వాయిదా వేస్తూ వస్తోంది. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​(PCC Chief Mahesh Goud) ఢిల్లీలో కాంగ్రెస్​ ముఖ్య నేతలతో చర్చించారు. మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర కార్యవర్గ కూర్పుపై వారు కేసీ వేణుగోపాల్​తో సమావేశమయ్యారు.

    మంత్రివర్గ విస్తరణకు అంతా లైన్​ క్లియర్​ అయింది అనుకునే సమయంలో పలువురు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి కావాలని డిమాండ్​ చేశారు. దీంతో కేబినెట్​ విస్తరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)​ ఎంట్రీ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ఆమె వరుస సమీక్షలు జరుపుతున్నారు.

    READ ALSO  CM Revanth | రూ.తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా జమ చేశాం: సీఎం రేవంత్​రెడ్డి

    Cabinet Expansion | ఎమ్మెల్యేలతో భేటీ

    మీనాక్షి నటరాజన్​ పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ అంశంపై వారితో చర్చించారు. వారి డిమాండ్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం సహా ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మరో ఆరు పదవులు ఖాళీ ఉన్నాయి. వీటిలో సామాజిక సమీకరణాల ప్రకారం నాలుగు పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్​ భావిస్తోంది. అయితే ఇటీవల మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయి తమకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు మీనాక్షి నటరాజన్​ను కలిసి విన్నవించారు.

    Cabinet Expansion | మీనాక్షిని కలిసిన విజయశాంతి

    కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ను ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayashanthi) ఆదివారం కలిశారు. ఎన్నికల ముందు ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరారు. పార్లమెంట్​ ఎన్నికల సమయంలో టికెట్​ ఆశించి భంగపడ్డ ఆమెను కాంగ్రెస్​ ఇటీవల ఎమ్మెల్సీని చేసింది. ఈ క్రమంలో తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఆమె మీనాక్షి నటరాజన్​ను కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. సరైన సమయంలో పదవులు వస్తాయన్నారు. పదవులు ఎవరికి ఇవ్వాలో అధిష్ఠానానికి తెలుసని ఆమె పేర్కొన్నారు. గత కమిటీల్లో తన పేరు లేకపోతే.. మరో కమిటీలో అవకాశం ఉంటుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.

    READ ALSO  Konda Surekha | కడియం నల్లికుట్ల మనిషి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

    మరో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్​ (MLC Addanki Dayakar) సైతం ఆమెను కలిశారు. కేబినెట్‌లో అవకాశం కల్పించాలని ఆయన కోరారు. మరోవైపు అందుబాటులో ఉన్న ఎంపీలతో మీనాక్షి సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేబినెట్​ విస్తరణ అంశం ఈ సారైనా పూర్తయ్యేనా లేదా అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.

    Latest articles

    Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kadapa | కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్​ బైక్(Electric Bike)​ పేలి ఓ మహిళ...

    Dil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | డ్ర‌గ్స్ తీసుకునే వారిని సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?...

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    More like this

    Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kadapa | కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్​ బైక్(Electric Bike)​ పేలి ఓ మహిళ...

    Dil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | డ్ర‌గ్స్ తీసుకునే వారిని సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?...

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...