అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల (Gandhari Government Junior College) ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ తరగతులు(Inter classes) ప్రారంభం కానున్నాయని తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తరగతులకు హాజరుకావాలని సూచించారు.
గాంధారి (Gandhari) మండలంలోని పేట్సంగెం, పోతంగల్ (Pothangal), గండివేట్ (Gandivate) గ్రామాల్లో కళాశాలలో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాలలో పొందిన విద్యార్థులకు అదే రోజు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తామని, ప్రభుత్వం అందజేసే స్కాలర్షిప్లు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మణ్, జెట్టి విజయకుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.