అక్షరటుడే, వెబ్డెస్క్ :PCC Chief | బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) ఆరోపించారు.
బీఆర్ఎస్(BRS)ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) సైతం ఆమె వ్యాఖ్యలు నిజమేనన్నట్లు మాట్లాడారు. వారి వ్యాఖ్యలపై మహేశ్గౌడ్ స్పందించారు.
కొందరు బీజేపీ సీనియర్ నేతలకు కేసీఆర్(KCR)తో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాజాసింగ్ చెప్పినట్లు బీజేపీ లోక్సభ టికెట్లు కూడా కేసీఆర్ సూచనలతోనే ఇచ్చారని ఆరోపించారు. రేపో మాపో బీజేపీ(BJP)లో బీఆర్ఎస్ విలీనమవుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతోందని, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.