అక్షరటుడే, వెబ్డెస్క్:Mega DSC | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది (Andhra Pradesh Government). మెగా డీఎస్సీ షెడ్యూల్(DSC Schedule) విడుదల చేసింది.
తాము అధికారంలోకి వస్తే భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది. ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఆయా పోస్టులకు మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Mega DSC | రెండు సెషన్లలో..
మెగా డీఎస్సీ(Mega DSC) పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.
ఓఎంఆర్(OMR) విధానంలో కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) ఆధారంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు(Education Department Officers) ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.