అక్షరటుడే, వెబ్డెస్క్ :Harish Rao | పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ (PCC President Mahesh Kumar Goud) వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్గౌడ్ చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులు (Kaleshwaram Commission notices) వచ్చిన తర్వాత హైదరాబాద్ శివారు శామీర్పేటలోని ఓ ఫామ్ హౌస్లో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరీశ్రావు భేటీ అయ్యారని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ శుక్రవారం ఆరోపించారు. అక్కడి నుంచే కేసీఆర్(KCR)కు ఫోన్ చేసి మాట్లాడారని పేర్కొన్నారు. కమిషన్ ముందు కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్.. ముగ్గురూ ఒకేలా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని మహేశ్గౌడ్ అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలను హరీశ్రావు ఖండించారు.
Harish Rao | సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక..
తమను సూటిగా ఎదుర్కునే ధైర్యం లేక కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) ఇలా మాట్లాడుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. బట్ట కాల్చి మీద వేస్తే అబద్ధాలు నిజాలయిపోవు అని పేర్కొన్నారు. పెళ్లిలు, చావులో కలిసిన సందర్భాలే తప్ప.. ఇతర పార్టీల నేతలను తాను కలవలేదని హరీశ్రావు(Harishrao) స్పష్టం చేశారు.
తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని, మీలా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధిపొందనని ఎద్దేవా చేశారు. మహేశ్ గౌడ్ తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు. అధికారంలోకి రావడంలోకి ఇచ్చిన హామీలను ముందు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.