అక్షరటుడే, హైదరాబాద్: Terror Attack | దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు terror attacks మరిన్ని జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు telangana police అప్రమత్తమయ్యారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో హెచ్ఐసీసీ HICC కేంద్రంగా జరగనున్న భారత్ సమిట్ bharat summit-2025, మే 7 నుంచి 31 వరకు నిర్వహించే మిస్ వరల్డ్-2025 miss world events hyderabad సహా పలు జాతీయ స్థాయి కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి CS shanti kumari పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ జితేందర్ DGP jitendar పలు అంశాలపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలపై భారత్ సమిట్లో చర్చ జరుగుతుంది. ఈ సమిట్లో రాహుల్గాంధీ Rahul Gandhi సహా వంద దేశాల నుంచి దాదాపు 400 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల కంటెస్టెంట్స్ హాజరుకానున్నారు.
ఇవన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు కావడంతో పోలీసు యంత్రాంగం సవాల్ గా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా ఇతర పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులు, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
భారత్ సమిట్ bharat summit 2025 జరిగే సైబరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాలను నేటి (గురువారం) నుంచే పోలీసులు తమ అధీనంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైటెక్ సిటీ సహా విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పాతబస్తీ సహా అనుమానిత ప్రాంతాల్లో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.