అక్షరటుడే, వెబ్డెస్క్: గ్రామ పాలన అధికారుల(జీపీవో) (Village administration Officers) పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రెవెన్యూ వ్యవస్థను (Revenue system) బలోపేతం చేయడంతో పాటు, భూ భారతి (BhuBharati) పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం 10,954 మంది జీపీవోలను నియమించాలని భావించిన విషయం తెలిసిందే.
ఈ పోస్టుల భర్తీ కోసం గతంలో వీఆర్ఏ, వీఆర్వోలు పని చేసిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 6,196 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25న పరీక్ష నిర్వహించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 3,550 జీపీవో పోస్టులకు ఎంపికయ్యారు. వీరికి జూన్ 2న నియామక పత్రాలు అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా.. మిగతా పోస్టులను ఎలా భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.