అక్షరటుడే, కామారెడ్డి: Sub-Division ASP Chaitanya Reddy | బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. గురువారం రాత్రి దేవునిపల్లి, మాచారెడ్డి(machareddy), రామారెడ్డి(Ramareddy), భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, రాజంపేట, కామారెడ్డి పట్టణ పోలీస్స్టేషన్(Kamareddy Town Police Station) పరిధిలోని ప్రజలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి పోలీస్శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని.. స్వచ్ఛందంగా వాహనాలు ఆపడం కరెక్ట్ కాదన్నారు. కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.