అక్షరటుడే, కోటగిరి : Kotagiri | రైతులు పంటల సాగులో యూరియా (urea) వాడకం తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచించారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా గురువారం పోతంగల్ మండలంలోని హెగ్డోలి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్తలు (Krishi Vigyan Kendra Rudrur scientists), వ్యవసాయ శాఖ (Agriculture Department) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సస్యరక్షణ శాస్త్రవేత్త పి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్య పరిరక్షణ, పచ్చి రొట్ట, అధిక రసానిక ఎరువుల వాడకంతో నష్టాలు, తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త, డా శ్వేత, వ్యవసాయ అధికారిణి నిషిత, ఏఎంసీ చైర్మన్, హన్మంత్, పుప్పాల శంకర్, పశు వైద్య అధికారి సురేష్, అభ్యుదయ రైతులు నాగం సాయిలు, అర్జున్ రావు, సాయినాథ్, శివరాజ్ ,శంకర్, రైతులు, తదితరులు, పాల్గొన్నారు.