అక్షర టుడే, వెబ్ డెస్క్:MLA Yennam | బీఆర్ఎస్(BRS), కేటీఆర్(KTR)పై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
కేసీఆర్ కొడుకు, కూతురు ఎంతో మంది ఉద్యమకారుల గొంతు కోశారని ఆరోపించారు. ఎంతో మంది రాజకీయ జీవితాలతో కేసీఆర్ కుటుంబం ఆడుకుందని అన్నారు. అందులో ఎమ్మెల్సీ కవిత పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపణలు చేశారు. సొంత కుటుంబాన్ని చూసుకోలేని కేసీఆర్ రాష్టాన్ని మళ్లీ ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ(Telangana)లో పనికి రాని ప్రాజెక్టులు కట్టి ప్రజలపై అప్పులు మోపారని విమర్శలు చేశారు. పాలనకు కేటీఆర్ అనర్హుడని కవిత చెబుతోందని ఎద్దేవా చేశారు.