More
    Homeజిల్లాలుకామారెడ్డిRajiv Yuva Vikasam | ‘రాజీవ్‌ యువవికాసం’కు సిబిల్‌ తిప్పలు.

    Rajiv Yuva Vikasam | ‘రాజీవ్‌ యువవికాసం’కు సిబిల్‌ తిప్పలు.

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Rajiv Yuva Vikasam | యువతకు సబ్సిడీపై (subsidi) రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువవికాసం పథకానికి సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) అడ్డంకిగా మారుతోంది. బ్యాంకులు సైతం లబ్ధిదారుల స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో చాలామంది పథకానికి దూరం కానున్నారు. ప్రభుత్వం ఓవైపు సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) ప్రాతిపదిక కాదని చెబుతున్నా.. బ్యాంకర్లు మాత్రం దాని ఆధారంగానే రుణాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    రాజీవ్‌ యువ వికాస్‌ పథకం (Rajiv Yuva Vikas scheme) కింద ప్రభుత్వం రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు అందించనుంది. జిల్లాకు 13.450 యూనిట్లు మాత్రమే కేటాయించింది. మొత్తం 44,739 మంది దరఖాస్తు చేసుకున్నారు. రుణాల మంజూరులో సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో బ్యాంకులు, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ల్లో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోతే సిబిల్ స్కోర్‌ cibil score పడిపోతుంది. కానీ, ఎంతోమంది వివిధ కారణాలతో రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారికి సిబిల్‌ స్కోర్‌ ఉండదు. ఈ పథకానికి వీరంతా అనర్హులు కానుండడంతో, ఆందోళన మొదలైంది. దీంతోపాటు ఇదివరకే ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు పొందినవారు కూడా అనర్హులు కానున్నారు.

    READ ALSO  Mla Venkata Ramana Reddy | మోదీ హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు

    Rajiv Yuva Vikasam | మొదటి విడతలో రూ.50 వేలకే..

    రాజీవ్‌ యువ వికాస్‌ కింద ప్రభుత్వం(Government) మొదటగా రూ.50 వేల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే మంజూరు కానుంది. జిల్లాలో 1127 మంది ఈ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నారు. మిగిలినవారికి విడతలవారీగా రుణాలు అందించనున్నారు.

    Rajiv Yuva Vikasam | పైరవీల కోసం ప్రదక్షిణలు..

    జిల్లాలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తమకు రుణం మంజూరవుతుందో, లేదోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే తమకు తెలిసిన నాయకుల ద్వారా పైరవీలు ప్రారంభించారు. ఎలాగైనా రుణం ఇప్పించాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు చోట మోటా నాయకులు పైరవీలు చేస్తూ.. కమీషన్‌ కూడా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ప్రక్రియ కొనసాగుతోంది..

    – సురేందర్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్

    READ ALSO  Police transfer | ముగిసిన పోలీసుల బదిలీల ప్రక్రియ

    జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 44,739 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం 13,450 యూనిట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో 1,127 మందికి రూ.50వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తాం. బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అడుగుతున్నారని తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణాలు మంజూరవుతాయి.

    Latest articles

    MLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ...

    Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో...

    CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి ఏడో బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant...

    Raja Raghuvanshi | మేఘాల‌య హనీమూన్ జంట విషాదంలో కొత్త కోణం.. మూడు నెల‌ల ముందే హ‌త్య‌కు కుట్ర‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Raja Raghuvanshi | హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త...

    More like this

    MLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ...

    Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో...

    CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి ఏడో బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant...