అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డీఈవో అశోక్(DEO Ashok) అన్నారు. రెడ్క్రాస్ సొసైటీ (Red Cross Society) ఆధ్వర్యంలో గురువారం నగరంలోని కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాలలో (Kotagalli Girls’ High School) రక్తదాన శిబిరం (Blood donation camp) ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రక్తదానం చేయడం అభినందనీయమని, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సాయి రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ ఛైర్మన్ ఆంజనేయులు, సభ్యులు తోట రాజశేఖర్, రవి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.