అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో వరుస చోరీలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
దేవునిపల్లిలోని (Devunipalli) కాసర్ల విహార్ ఫేస్-2లో అర్ధరాత్రి తర్వాత దొంగలు హల్చల్ చేశారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న నర్సాగౌడ్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు క్లూస్ టీంతో (Police Clues Team) చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో రూ.75వేల విలువైన టీవీని ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. సీసీ ఫుటేజీలో చోరీకి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అయితే కాలనీలో నెల రోజుల వ్యవధిలో మూడు ఇళ్లల్లో చోరీ జరిగిందని కాలనీవాసులు తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని, పట్టణ శివారు ప్రాంతాల్లో నిఘా పెట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.