More
    HomeతెలంగాణCM Revanth Reddy | తెలంగాణలో కీలక పరిణామం.. మంత్రులకు సీఎం దావత్..​ ఇది అందుకోసమేనా..?

    CM Revanth Reddy | తెలంగాణలో కీలక పరిణామం.. మంత్రులకు సీఎం దావత్..​ ఇది అందుకోసమేనా..?

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్:CM Revanth Reddy | ఇదిగో అదిగో కేబినెట్‌ విస్తరణ..! అంటూ గత కొన్ని నెలలుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది.

    సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్‌ విస్తరణ తెరపైకి వస్తోంది. ఇటీవలే ఇక ఫైనల్​కు వచ్చిందని ప్రచారం జరిగింది. పార్టీ​ అగ్రనేత రాహుల్​గాంధీ (Rahul Gandhi) ఒకే అనగానే ప్రకటిస్తారని అన్నారు. కానీ, మళ్లీ వాయిదా పడటంతో ఆశావహులు ఉసూరుమన్నారు. ఇలాంటి తరుణంలో ఆసక్తికర మరిణామం చోటుచేసుకుంది.

    CM Revanth Reddy | మంత్రులకు స్పెషల్ విందు ఎందుకు!

    మంత్రులందరికీ బంజారాహిల్స్ (Banjara Hills) లోని తన ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రైవేటు డిన్నర్ పార్టీ అరెంజ్​ చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్చలీ చర్చకు వచ్చింది. సీఎం పిలుపుతో దాదాపుగా మంత్రివర్గం (Ministerial Council) మొత్తం సీఎం ఇంటికి చేరిపోయింది. ముఖ్యమంత్రి ఇచ్చిన డిన్నర్​ను ఆరగించింది! ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఈ డిన్నర్‌ ఎందుకనేదానిపై చర్చ నడుస్తోంది.

    READ ALSO  District Judge | రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి: జిల్లా జడ్జి

    విందు పేరుతో మంత్రులు ఏం చర్చించుకున్నారు..? ముఖ్యమంత్రి వాళ్లకు ఏం చెప్పారు? అనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్‌ బెర్త్‌(Cabinet Berth) కోసం ఎదురుచూస్తున్న నేతల్లో ఉత్కంఠకు కారణం అయింది. విస్తరణకు ముందు ముఖ్యమంత్రి ఆనవాయితీగా ఇచ్చే డిన్నర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది.

    CM Revanth Reddy | రంగంలోకి మీనాక్షి నటరాజన్

    కాగా.. మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాది కాలంగా పెండింగులో ఉంది. సామాజిక సమీకరణాల కారణంతో అధిష్టానం వాయిదా వేస్తూ వస్తోంది. దీంతో గతంతో పోలిస్తే.. ప్రస్తుతం ఆశావహులు మూడింతలు పెరిగారు. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు తమ తమ సామాజిక వర్గాలుగా విడిపోయారు. రహస్యంగా భేటీ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీకి జలక్ ఇస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. అన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరి అందరినీ బుజ్జగించి.. ఈ సారైనా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తారా..? లేక ఎప్పటిలాగే మళ్లీ చూద్దామని వదిలేస్తారా..? అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

    READ ALSO  Kamareddy | యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అమ్మితే చర్యలు

    Latest articles

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    More like this

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...