More
    HomeజాతీయంUnion Cabinet | రైతులకు కేంద్రం గుడ్​న్యూస్​.. పంటల మద్దతు ధర పెంపు

    Union Cabinet | రైతులకు కేంద్రం గుడ్​న్యూస్​.. పంటల మద్దతు ధర పెంపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MSP Hike | రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central Govy) గుడ్​ న్యూస్​ చెప్పింది. పంటల మద్దతు ధర(MSP) పెంచుతు కేంద్ర కేబినెట్ (Union Cabinet)​ నిర్ణయం తీసుకుంది.

    ప్రధాని మోదీ(PM Modi) అధ్యక్షతన బుధవారం కేబినెట్​ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో వరి(Paddy)తో సహా 14 పంటల మద్దతు ధర పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏ గ్రేడ్​ ధాన్యం క్వింటాల్​ ధర రూ.2,320 ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్వింటాల్​కు రూ.69 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరి ఏ గ్రేడ్​ రకం ధర క్వింటాల్​కు రూ.2,389 కానుంది.

    Union Cabinet | ఏటా ధర పెంపు

    కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండటానికి ఏటా పంటల మద్దతు ధరను పెంచుతుంది. వానాకాలం సీజన్​ ప్రారంభంలో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ధర వానాకాలం, యాసంగి సీజన్​లకు అందుబాటులో ఉంటుంది. కాగా.. బుధవారం కేబినెట్​ మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Minister Aswini vaishnav)​ మీడియాకు వెల్లడించారు. గత పదేళ్లుగా ఖరీఫ్ పంటలకు మద్దతు ధర భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా ఎంఎస్‌పీ పెంపును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిందన్నారు.

    READ ALSO  Israel - Iran | 200 యుద్ధ విమానాలతో దాడి చేసిన ఇజ్రాయెల్

    ఆయా పంటలకు మద్దతు ధర కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ (Interest Subsidy) కింద రూ.15,642 కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50శాతం మార్జిన్‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.

    Union Cabinet | ధరలు ఎంత పెరిగాయంటే..

    మొత్తం 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరి సాధారణ, ఏ గ్రేడ్​ ధాన్యం రేటు క్వింటాల్​కు రూ.69 పెంచాలని నిర్ణయించింది. దీంతో సాధారణ రకం ధర క్వింటాల్​కు రూ.2,369, ఏ గ్రేడ్​ ధాన్యం ధర రూ.2,389 కానుంది. జొన్నలు క్వింటాల్​కు రూ.328 పెంచింది. సజ్జల ధర రూ.150, రాగులు రూ.596, మొక్కజొన్న రూ.175, పెసర రూ.86, కందిపప్పు రూ.450, వేరుశెనగ రూ.480, మినుములు రూ.400, పొద్దుతిరుగుడు రూ.441, కుసుమలు రూ.579, సోయాబీన్ రూ.436, వలిశలు (గడ్డినువ్వులు) రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    READ ALSO  Plane Crash | భర్త దగ్గరికి తొలిసారి వెళ్తూ.. విమాన ప్రమాదంలో యువతి మృతి

    Union Cabinet | బద్వేల్​– నెల్లూరు రోడ్డుకు ఆమోదం

    కేంద్ర ప్రభుత్వం ఏపీలోని బద్వేల్‌- నెల్లూరు(Badwel- Nellore) మార్గంలో నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108 కిలోమీటర్ల పొడవున రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది.

    Latest articles

    Vijay Rupani | నేడు గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Rupani : గుజరాత్‌ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను...

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూనియర్ ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...

    AP GOVT | లక్ష మంది పేద విద్యార్థులకు JEE, NEET ఉచిత కోచింగ్ .. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది పేద మరియు సాధారణ కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా JEE, NEET...

    More like this

    Vijay Rupani | నేడు గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Rupani : గుజరాత్‌ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను...

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూనియర్ ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...