అక్షరటుడే, వెబ్డెస్క్:Operation Sindoor | పహల్గాంలో జరిపిన మారణకాండకి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ ఆపరేషన్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులని మట్టుబెట్టారు. అయితే భారత సైన్యం(Indian Army) ఎంత ధైర్యంగా యుద్ధాలు చేస్తుందో, అలాంటి సమయాల్లో వారికీ మానవీయ సహాయం అందించే పౌరులు కూడా అంతే గొప్పవారు. అలాంటి మహానుభావుల్లో ఒకరు 10 ఏళ్ల శ్రావణ్ సింగ్ (Shravan Singh). ఆయన ఆపరేషన్ సిందూర్ Operation Sindoor సమయంలో తన ఇంటి పరిసరాలలో ఉన్న జవాన్లకు నీరు, పాలు, లస్సీ అందించి దేశభక్తికి గొప్ప ఉదాహరణగా నిలిచారు.
Operation Sindoor | ట్రూ ఇండియన్..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్లోని తారా వాలి గ్రామం (Tara Wali village)లో నివసించే 10 ఏళ్ల శ్రవణ్ సింగ్ తన వంతు సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. స్థానిక రైతు సోనా సింగ్ కుమారుడు అయిన శ్రావణ్ సింగ్, పెద్దయ్యాక భారత ఆర్మీ సైనికుడిగా Indian Army మారాలని కలలు కంటున్నాడు. ఫిరోజ్పూర్ జిల్లాలోని తన గ్రామంలో యుద్ధ వాతావరణాన్ని చూసిన అతను, సరిహద్దు కాల్పులకు భయపడకుండా సైనికులు (Soldiers) పడుతున్న ఇబ్బందులు చూసి వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
శ్రావణ్ సింగ్ మాట్లాడుతూ.. ఆ సమయంలో నేను భయపడలేదు. నేను పెద్దయ్యాక సైనికుడిని కావాలనుకుంటున్నాను. సైనికుల కోసం నేను నీరు, లస్సీ తీసుకెళ్లేవాడిని. వారు నన్ను చాలా ప్రేమించారు అని శ్రావణ్ సింగ్ Shravan Singh మీడియాతో అన్నారు.
అయితే అతని నిస్వార్థ సేవకు భారత సైన్యం (Indian Army) ముగ్ధులై అతన్ని సత్కరించింది. ఒక ప్రత్యేక కార్యక్రమంలో, 7వ పదాతిదళ విభాగానికి చెందిన మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్ (Major General Ranjit Singh Manral) యువ శ్రావణ్ సింగ్కు ఒక జ్ఞాపకం, భోజనం మరియు అతనికి ఇష్టమైన డెజర్ట్ – ఐస్ క్రీం వంటి బహుమతులను బహుకరించారు. దీనికి సంతోషించిన బాలుడు సైన్యంలో చేరి తన దేశానికి సేవ చేయాలనే తన ఆకాంక్షను పంచుకున్నాడు. ఈ పిల్లాడు చాలా మందికి ఆదర్శం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.