More
    HomeతెలంగాణMiss World Competitions | మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు ఏకంగా 3500 మంది అతిథులా..వేదిక...

    Miss World Competitions | మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు ఏకంగా 3500 మంది అతిథులా..వేదిక ఎక్క‌డంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Miss World Competitions | మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. హైదరాబాద్ Hyderabad వేదిక‌గా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ మే 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌(Hitex Exhibition Center)లో జరగనున్నాయి. శనివారం సాయంత్రం 5:30 గంటలకు రెడ్ కార్పెట్ ఈవెంట్‌తో ఈ ఫైనల్స్ ప్రారంభం కానుండ‌గా రాత్రి 9.30కి ముగుస్తాయి. .ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న 40 మంది అందాల భామలు, ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు.

    Miss World Competitions | అత్యంత వైభ‌వంగా..

    ఇప్పటి వరకు జరిగిన స్పెషల్ ఛాలెంజ్‌ల ద్వారా 14 మంది పోటీదారులు క్వార్టర్స్‌కి నేరుగా ఎంపికయ్యారు.వీరిలో స్పోర్ట్స్ ఛాలెంజ్‌ నుంచి ఒకరు,టాలెంట్ ఛాలెంజ్‌లో ఒకరు,హెడ్ టు హెడ్ రౌండ్‌లో నలుగురు,టాప్ మోడల్ విభాగంలో నలుగురు,బ్యూటీ విత్ ఏ పర్పస్ విభాగం నుంచి మరో నలుగురు విజేతలుగా నిలిచారు.మిగిలిన 26 మంది ఎంపిక ప్రక్రియ వివిధ ఖండాల ప్రాతినిధ్యం మేరకు జరగనుంది. అమెరికా-కరేబియన్, ఆఫ్రికా Africa , యూరప్, ఆసియా-ఓషియానా ఖండాలకు చెందిన పోటీదారులను న్యాయనిర్ణేతలు ఎంపిక చేయనున్నారు. మే 31న జరిగే తుది పోటీల్లో టాప్ మోడల్ ఛాలెంజ్, స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్ ఛాలెంజ్, బ్యూటీ విత్ ఎ పర్సన్ ఇలా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 14 మంది క్వార్టర్ ఫైనల్స్ కి చేరారు.

    READ ALSO  Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ యాదవ సంఘం ఎన్నిక

    ఈ కార్యక్రమం సోనీ టీవీ 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందువల్ల.. ఇది తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెడుతోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి revanth reddy, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా 3,500 మంది ప్రేక్షకులు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యం, ఆధునికతను ప్రదర్శించే ఈ కార్యక్రమం, రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో జరుగుతోంది. కాగా, గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ జరగగా.. ఇందులో 116 దేశాల నుంచి అందాల సుందరాంగులు పాల్గొన్నారు.

    Latest articles

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    More like this

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...