అక్షరటుడే, వెబ్డెస్క్:Ration Shops | తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు నూతన కార్డుల పంపిణీని కసరత్తు కూడా ప్రారంభించింది.
ఇప్పటికే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల యాడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే లబ్ధిదారులకు నూతన కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రాష్ట్రంలో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) ఇవ్వలేదు. అలాగే కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చే అవకాశం కూడా కల్పించలేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని యోచిస్తోంది.
Ration Shops | హైదరాబాద్లో..
ప్రభుత్వం వన్ నేషన్.. వన్ రేషన్ విధానం అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యం తీసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది వలస వచ్చి హైదరాబాద్ (Hyderabad city) నగరంలో నివసిస్తున్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారుల సంఖ్య పెరగనుండటంతో హైదరాబాద్లో బియ్యం పంపిణీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ GHMC ration shops పరిధిలో కొత్తగా రేషన్షాపులు (New Ration Shops) పెంచేందుకు సివిల్సప్లయీస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Ration Shops | 50 షాపుల ఏర్పాటుకు కసరత్తు
అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలోని రేషన్ షాపుల (Ration Shops) వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. పలువురు రేషన్ షాపులను సక్రమంగా తీయడం లేదని, బినామీలు నడుపుతున్నారని ఇటీవల 30 దుకాణాలను రద్దు చేశారు. దీంతో ఈ 30 రేషన్ దుకాణాలకు అదనంగా మరో 50 కొత్తగా ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 624 రేషన్షాపులు నడుస్తున్నాయి. నగరంలో ఇప్పుడు 6,39,451 కార్డులున్నాయి. కొత్త కార్డుల కోసం దాదాపు 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో లబ్ధిదారులు, కార్డుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో అదనంగా 50 దుకాణాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.