అక్షరటుడే, నిజామాబాద్ సిటీ:Nizamabad City | అర్ధరాత్రి వరకు పలు దుకాణాలు తెరిచిఉంచిన యజమానులకు న్యాయస్థానం (nizamabad Court) జైలుశిక్ష విధించింది.
ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి(1 town SHO Ragupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో పోలీసుకు రోజువారీ తనిఖీలు చేపట్టారు. వీక్లిమార్కెట్లోని రెయిన్బో బార్, వైష్ణవి టిఫిన్ సెంటర్, మాలపల్లిలోని ఫ్రూట్మార్కెట్ వద్ద పాన్షాప్ నిర్వాహకులు అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచినట్లు గుర్తించారు. సంబంధిత యజమానులను అదుపులోకి తీసుకుని సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా ముగ్గురికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.