అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | నగర పద్మశాలి సంఘం ఎన్నికల్లో గెలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్ (Konda Laxman Bapuji Panel) సభ్యులు సోమవారం మార్కండేయ మందిరంలో (Markandeya Temple) పూజలు చేశారు.
సోమవారం నగర అధ్యక్షుడు పెంట దత్తాద్రి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి చౌకి భూమయ్య, కోశాధికారి మోర సాయిలు, ఉపాధ్యక్షులు మురళి, దుబ్బరాజం, శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు అవధూత రాములు, ఎనుగందుల సుభాష్, భూస రవి, ప్రచార కార్యదర్శి భూస శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కస్తూరి గంగరాజు ఆయన వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు ఎస్ఆర్ సత్యపాల్, మాజీ ప్రధాన కార్యదర్శి బిల్లా మహేష్, గుండా సంతోష్, మేక సాగర్ తదితరులు పాల్గొన్నారు.