అక్షరటుడే, వెబ్డెస్క్ :Cabinet Expansion | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన.. మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు, పార్టీ కార్యవర్గ కూర్పుపై వారు చర్చించినట్లు సమాచారం.
Cabinet Expansion | ఆశావహుల నిరీక్షణ
తెలంగాణలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. మంత్రివర్గాన్ని విస్తరించలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యే(MLA)లు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పలువురు సీనియర్ నాయకులు తమకు పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పదవులు తక్కువగా ఉండటం.. ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి రావడం లేదు.
Cabinet Expansion | నేడు ఖర్గే, రాహుల్తో సమావేశం
సీఎం రేవంత్రెడ్డి సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను ఆయన వారి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. పీసీసీ కార్యవర్గంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఖర్గే, రాహుల్ను సీఎం కలిసిన అనంతరం మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పదవులు ఎవరికి దక్కుతాయోనని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.