అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao | కేంద్ర ప్రభుత్వం (Central Governament) తెలంగాణపై కక్ష కట్టిందని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఆరోపించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్కు (Andhra pradesh) నిధులు ఇస్తున్న కేంద్రం.. తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు (BJP MPs).. ఇద్దరు కేంద్ర మంత్రులు (Cental minister) ఉన్నా నిధులు తీసుకు రావడం లేదన్నారు. ఏపీలోని పోలవరం ప్రాజక్ట్కు (Polavaram project) జాతీయ హోదా ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయ్యి చూపిందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల నిర్మాణానికి (projects construction) రూ.లక్ష 60 వేల కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు, తెలంగాణకు అందులో ఒక శాతం కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ని బాయ్కాట్ చేస్తున్నామని అన్నాడని.. ఇప్పుడు ముందుకు ముందే వెళ్అలి సమావేశంలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.