అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Padmashali Sangam | నిజామాబాద్ నగర పద్మశాలి ఎన్నికలు padmashali sangham nizamabad హోరాహోరీగా జరుగుతున్నాయి. వర్నీరోడ్లోని (Varni road) పద్మశాలి ఉన్నత పాఠశాలలో (Padmasali High School) ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
నగరంలో మొత్తంగా 65 తర్పలు ఉండగా 5,200కు పైగా ఓటర్లు ఉన్నారు. అయితే 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా మూడు ప్యానళ్లు పోటీలో ఉండగా.. రెండు ప్యానెళ్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం తుది ఫలితాలు వెలువడనున్నాయి.